మజ్లిస్ ఒత్తిడితోనే విమోచనం నిర్వహిస్తలేరు : రామచందర్ రావు

మజ్లిస్ ఒత్తిడితోనే  విమోచనం నిర్వహిస్తలేరు :  రామచందర్ రావు

న్యూఢిల్లీ, వెలుగు: మజ్లిస్ ఒత్తిడితోనే బీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు విమర్శించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణలోనూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. అమరుల త్యాగాలను మజ్లిస్, బీఆర్ఎస్ తక్కువ చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.