- పార్టీలో చేరిన పట్నం సునీత, బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ శ్రీదేవి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి
బీఆర్ఎస్కు చెందిన పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి.. సినీ నటుడు అల్లు అర్జున్ మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య, కార్పొరేటర్ శ్రీదేవి శుక్రవారం గాంధీ భవన్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పట్నం సునీత వెంట ఆమె భర్త, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం వారంతా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.