సంపన్నుల బడ్జెట్... కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే

 సంపన్నుల బడ్జెట్... కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే
  • బడ్జెట్ లో పేదల కోసం ఏమీ లేదు

న్యూ ఢిల్లీ : నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నుల కోసమే తప్ప పేదల కోసం కాదని రాజ్యసభ ప్రతిపక్ష లీడర్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పేదల కోసం ఈ బడ్జెట్ లో ఏమీ లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మహాభారతంలోని కొన్ని పాత్రలను బడ్జెట్ కు లింక్ చేస్తూ.. ' ఇది అర్జున, ద్రోణాచార్యుల బడ్జెట్ అని, ఏకలవ్యది కాదు ' అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. క్రిప్టో కరెన్సీ కోసం ఎలాంటి చట్టంలేదని, దీనిపై ఇంతకుముందెన్నడూ చర్చ జరగలేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగా ఉండే బడా కార్పొరేట్లకు ఈ బడ్జెట్ అనుకూలంగా ఉందని ఖర్గే విమర్శించారు.

ఇవి కూడా చదవండి..

ఇది మోసపూరిత బడ్జెట్