హరియాణా మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ రెయిడ్స్
విదేశీ మద్యం, రూ.5 కోట్లు సీజ్
ఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసులో పంజాబ్, హరియాణాల్లో ఈడీ విస్తృతంగా దాడులు చేసింది. రెండు రాష్ట్రాల్లో 20కిపైగా ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. హరియాణా నేత, మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్ నివాసంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విదేశాల్లో తయారైన తుపాకులు,100కుపైగా లిక్కర్ బాటిళ్లు,300కుపైగా కార్ట్రిజ్లు, రూ.5 కోట్ల విలువైన నోట్ల కట్టలు, సుమారు 5 కేజీల గోల్డ్, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సురీందర్ పన్వర్ ఇంట్లోనూ అధికారులు సోదాలు చేశారు.