నోట్ల కట్టలు.. తుపాకులు

నోట్ల కట్టలు.. తుపాకులు

 హరియాణా మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ రెయిడ్స్
 విదేశీ మద్యం, రూ.5 కోట్లు సీజ్ 

ఢిల్లీ: అక్రమ మైనింగ్‌ కేసులో పంజాబ్‌, హరియాణాల్లో ఈడీ విస్తృతంగా దాడులు చేసింది. రెండు రాష్ట్రాల్లో 20కిపైగా ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. హరియాణా నేత, మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్‌ సింగ్‌ నివాసంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  విదేశాల్లో తయారైన తుపాకులు,100కుపైగా లిక్కర్ బాటిళ్లు,300కుపైగా కార్ట్రిజ్‌లు,  రూ.5 కోట్ల విలువైన నోట్ల కట్టలు, సుమారు 5 కేజీల గోల్డ్, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సురీందర్‌ పన్వర్‌ ఇంట్లోనూ అధికారులు సోదాలు చేశారు.