బ్రిడ్జిని ఢీకొట్టి గాల్లో వేలాడిన బస్సు

బ్రిడ్జిని ఢీకొట్టి గాల్లో వేలాడిన బస్సు

అగ్రా: 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ఓ భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.  యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై  ఝాన్సీ నుంచి ఢిల్లీ వెళుతున్న ఆ బస్సు బ్రిడ్జి పైకి దూసుకెళ్లి అక్కడే ఆగిపోయింది. నేలకు 50 అడుగుల ఎత్తులో అలాగే బ్రిడ్జి పైనే బస్సు నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేత పట్టుకొని దేవుణ్ని స్మరిస్తూ ఆ ప్రమాదం నుంచి రెస్క్కూ టీమ్   సహాయంతో బయటపడ్డారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే  సహయక బృందం  అక్కడికి చేరుకొని ప్రయాణీకులను ఒక్కొక్కరిగా బయటకు దించింది.  దాదాపు 10 నిమిషాలపాటు బ్రిడ్జి పైనే బస్సు అలా ఉండిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.

Bus rams into barrier on Yamuna e-way flyover, 10 injured