గండిపేట, వెలుగు: కూతురిని చూసేందుకు భర్తతో కలిసి వెళ్తున్న మహిళను లారీ ఢీకొనడంతో స్పాట్లోనే చనిపోయింది. మైలార్దేవ్పల్లిలోని మధుబన్ కాలనీకి చెందిన గూడ రాజు, స్వప్న దంపతులు. షాద్నగర్లో ఉంటున్న తమ కూతురిని చూడటానికి ఆదివారం మధ్యాహ్నం బైక్పై బయలుదేరారు.
శంషాబాద్ మండలం పాలమాకుల సమీపంలో వీరిని వెనుక నుంచి లారీ కంటైనర్ ఓవర్స్పీడ్తో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న స్వప్న కిందపడి పోగా, ఆమె తలపై నుంచి లారీ టైరు దూసుకెళ్లి అక్కడికక్కడే చనిపోయింది. భర్త రాజుకు తీవ్ర గాయాలు కాగా, సమీప హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
