- ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద క్యాబ్ డ్రైవర్ల ఆందోళన
పంజాగుట్ట, వెలుగు: డ్రైవర్ల సంపాదనను ఓలా, ఉబర్ వంటి సంస్థలు దోచుకుంటున్నాయని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద క్యాబ్ డ్రైవర్లు శనివారం ధర్నా చేపట్టారు. తక్షణమే ఈ యాప్లను నిషేధించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
డ్రైవర్ యూనియన్ నాయకులు సతీశ్ బాబు, కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటుతోపాటు నగరంలో పార్కింగ్ స్థలాల కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సీఐటీయు నాయకులు అజయ్ బాబు, సిద్దార్థ్ గౌడ్, డ్రైవర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
