
- సెమీ కండక్టర్ల తయారీ సంస్థ కేన్స్ టెక్నాలజీ క్లారిటీ
- అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ ప్రారంభోత్సవానికి సీఎంకు ఆహ్వానం
హైదరాబాద్ , వెలుగు: తెలంగాణలోనే కొనసాగుతామని సెమీ కండక్టర్ల తయారీ సంస్థ కేన్స్ టెక్నాలజీ తేల్చి చెప్పింది. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ఆ సంస్థ సీఈవో రఘు ఫణికర్ స్పష్టం చేశారు. ఈ నెల 23న కొంగరకలాన్ లో కేన్స్ సంస్థ అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ ను ప్రారంభించబోతున్నది.
ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫణికర్ సోమవారం సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఓ శాట్ యూనిట్ ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ పరిశీలనలో ఉంది. ఐఎస్ఎం అనుమతి రాగానే ఓ శాట్ యూనిట్ ఆపరేషన్లను ప్రారంభిస్తామని ఫణికర్ తెలిపారు.