మీడియా ప్రసారాలను నియంత్రించలేమన్న సుప్రీం

మీడియా ప్రసారాలను నియంత్రించలేమన్న సుప్రీం

కోర్టులో జరిగే వాదనలకు సంబంధించి రిపోర్టింగ్ చేయకుండా మీడియాను కట్టడి చేయలేమని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. అయితే, మీడియా ఇచ్చే సమాచారం స్పష్టంగా, సంపూర్ణంగా ఉండాలని మాత్రం సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తికి ఈసీనే కారణమంటూ మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి... ఈసీ వేసిన పిటిషన్ ను విచారిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రజాకోణంలో మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలను చూడాలని చెప్పింది.
 
మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలను మీడియా ప్రముఖంగా ప్రసారం చేయడంపై తాము ఇప్పటికిప్పుడే కలగజేసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టు ఆదేశాలు, ఉత్తర్వులు ఫైనల్ అని స్పష్టం చేసింది. హైకోర్టులను తాము కించపరిచబోమని చెప్పింది. న్యాయ వ్యవస్థలో హైకోర్టులు చాలా కీలకమని చెప్పింది. విచారణ సమయంలో హైకోర్టు జడ్జిలు చేసే వ్యాఖ్యలను తాము నియంత్రించలేమని చెప్పింది సుప్రీం.