కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ కి క‌రోనా

 కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ కి క‌రోనా

పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్  కరోనా బారిన పడ్డారు. అయితే త‌న‌కి స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం తాను ఐసోలేష‌న్ లో ఉన్నాన‌ని.. త‌న‌ని క‌లిసిన వారంతా క‌రోనా టెస్ట్ లు చేయించుకోవాల‌ని సూచించారు. త్వరలో  పంజాబ్ ఎన్నిక‌లు జరగనున్న ఈ సమయంలో  అమ‌రీంద‌ర్ క‌రోనా బారిన ప‌డ‌టం పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీతో పాటు పొత్తు భాగస్వామి బీజేపీ కూడా దెబ్బే. కొన్ని రోజుల పాటు ప్రచారంపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. 

ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్, కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై తో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ కరోనా బారిన పడ్డారు.

మరిన్ని వార్తల కోసం..

కరోనాపై ఆటో డ్రైవర్ అద్భుతమైన మెసేజ్