ఫోటోలకు పోజులిచ్చిన రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్

ఫోటోలకు పోజులిచ్చిన రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్

టీ20 వరల్డ్ కప్కు వేళయింది. మరి కొన్ని గంటల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ నెల 16 నుంచి టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్లో పాల్గొనే జట్ల కెప్టెన్లు కెమెరాలకు పోజులిచ్చారు. కెప్టెన్లు ఫోటోషూట్లో పాల్గొన్నారు. 

ఒకే వేదికపై కెప్టెన్లు..
ఆదివారం నుంచి టీ20 ప్రపంచకప్ 2022 మొదలు కానుంది. ఈ నేపథ్యంలో  16 జట్ల కెప్టెన్లు ఒకే వేదికపైకి వచ్చారు. అందరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.  ఫొటోషూట్‌లో సందడి చేశారు. ఇదే స్టేజ్ పై పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తన పుట్టినరోజును జరుపుకున్నాడు. బాబర్ ఆజమ్ కు కెప్టెన్లందరూ శుభాకాంక్షలు తెలిపారు. 

బాబర్తో రోహిత్..
పోటోషూట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  ఇద్దరూ  ఫొటో షూట్‌లో పాల్గొని సందడి చేశారు. ఈ నెల 23న భారత్ -పాక్ మధ్య మ్యాచ్ ఉన్న నేపథ్యంలో...ఐసీసీ ప్రోటోకాల్ ప్రకారం..రెండు జట్లు కెప్టెన్లు ఫోటోషూట్ లో పాల్గొనాలి. అందుకే వీరిద్దరు కలిసి పోటోలు దిగారు. 

16 జట్లు ...
ఈ నెల 16 నుంచి టీ20 వరల్డ్ కప్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు తలపడనున్నాయి. 21 వరకు గ్రూప్ స్టేజ్ మ్యాచులు జరగనుండగా..22 నుంచి సూపర్ 12 మ్యాచులు ప్రారంభం అవుతాయి.