వేములవాడలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు

వేములవాడలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు

వేములవాడ, వెలుగు: మద్యం మత్తులో ఉన్న ఓ డ్రైవర్‌‌ కారును అతివేగంగా నడిపి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల రూట్‌‌ నుంచి కారులో కరీంనగర్‌‌ వెళ్తున్న ఓ వ్యక్తి మద్యం మత్తులో అతివేగంగా నడుపుతూ వేములవాడ అర్బన్‌‌ మండలం రుద్రవరంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సదయ్య (28)ను ఢీకొట్టడంతో అతడు చనిపోయాడు. 

అనంతరం అరేపల్లి గ్రామంలో బైక్‌‌పై వెళ్తున్న వేములవాడకు చెందిన పండరినాథ్ (25), చందును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పండరినాథ్‌‌ చనిపోగా, చందుకు తీవ్రగాయాలు అయ్యాయి. తర్వాత డ్రైవర్‌‌ కారును ఆపకుండా అలాగే వెళ్లి ఓ బండరాయికి ఢీకొట్టడంతో అతడు సైతం గాయపడ్డట్లు సమాచారం.