వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఆటోను అతివేగంతో వచ్చిన కారు ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  పరిగి పరిధిలోని శ్రీ వెంటేశ్వర బాయిలర్ సమీపం నుంచి ప్రయాణికులు ఆటోలో వెళ్తున్నారు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపైకి ఆటో రాగానే వెనకనుంచి అతివేగంగా వస్తున్న కారు ఆటోను బలంగా ఢీకొంది.

దీంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 8 మంది క్షతగాత్రులను పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. దీంతో  వారిని స్థానికులు హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తున్నారు. ప్రత్యక్ష సాక్ష్యులను విచారిస్తున్నారు.