తాగిన మైకంలో రాష్ డ్రైవింగ్: ఇద్దరికి గాయాలు

తాగిన మైకంలో రాష్ డ్రైవింగ్: ఇద్దరికి గాయాలు

తాగిన మైకంలో రాష్ డ్రైవింగ్ చేశారు ఇద్దరు యువకులు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం రాయపోల్ గ్రామంలో జరిగింది. కుకట్ పల్లికి చెందిన సాయికుమార్, వినిత్ రావు TS 09 TR 8850 గల బ్రీజా కారుతో బీబత్సం సృష్టించారు. ఫుల్ గా తాగిన ఇద్దరు… గురువారం పొద్దున 9.20 నిమిషాలకు రాయపోల్ గ్రామంలో కారును స్పీడ్ గా నడుపుతూ పార్క్ చేసివున్న ఒక బైక్ ను ఢీకొట్టారు. దీంతో పాటే.. స్కూల్ కు పోతున్న 8వ తరగతి స్టుడెంట్ హేమవతితో పాటు నడుచుకుంటూ వెళ్తున్న ఆగమయ్య అనే అతన్ని కూడా ఢీకొట్టారు. వారిద్ధరికీ తీవ్రగాయాలవగా.. హస్పిటల్ కు తీసుకెళ్లారు స్థానికులు. దీంతో పాటే కారు నడుపుతున్న వారిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.  సాయికుమార్, వినిత్ రావుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మోతాదుకు మించి లిక్కర్ తాగినట్టు పోలీసుల గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.