కాలువలో పడిపోయిన కారు..ముగ్గురి మృతి

కాలువలో పడిపోయిన కారు..ముగ్గురి మృతి

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పీఏ పల్లి మండలం దుగ్యాల దగ్గర కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఏఎంఆర్పీ కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయారు. ఒకరిని స్థానికులు కాపాడారు. స్థానికులతో కలిసి అధికారులు మూడు మృతదేహాలను నీళ్ల నుంచి బయటికి తీశారు.

చనిపోయిన వారిని పీఏ పల్లి మండలం వడ్డెరిగూడెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులంగా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. కారు ముందు టైర్ పగడంతో అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిందని భావిస్తున్నారు.