ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ ట్రాలీని ఢీకొట్టిన కారు..

ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ ట్రాలీని ఢీకొట్టిన కారు..
  • నలుగురు మృతి ఉత్తరప్రదేశ్‌‌‌‌లో ఘటన

బుధౌన్(యూపీ): ఉత్తరప్రదేశ్‌‌‌‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మోరదాబాద్‌‌‌‌, ఫరూఖాబాద్‌‌‌‌ రోడ్‌‌‌‌ ప్రాంతంలోని దహేమీ గ్రామంలో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగింది.

గ్రామంలో రోడ్డు పక్కన నిలిపిన ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ ట్రాలీని కారు వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని, వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.