కాల్వలో పడ్డ కారు.. మృతులంతా పెద్దపల్లి ఎమ్మెల్యే బంధువులు

కాల్వలో పడ్డ కారు.. మృతులంతా పెద్దపల్లి ఎమ్మెల్యే బంధువులు

కరీంనగర్ జిల్లా కాకతీయ కెనాల్ లో మూడు మృతదేహాలు బయటపడడం కలకం రేపుతోంది. తిమ్మాపూర్ మండలం అలుగనూరు వద్ద కెనాల్ లో తేలియాడుతున్న కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు పోలీసులు. కారులో కుళ్లిపోయిన  మూడు మృతదేహాలను గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ కాలనీకి చెందిన సత్యనారాయణ రెడ్డి కారుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిగా గుర్తించారు.  మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బావ, చెల్లెలు, మేనకోడలిగా గుర్తించారు. జనవరి 27న హైదరాబాద్ వెళ్తున్నా మంటూ వెళ్లారు. అయితే అప్పటి నుంచి వారి ఆచూకి కనిపించలేదంటూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని సిపి వెల్లడించారు.