
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 517 కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,73,858కు చేరింది. 1,474 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,778 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,64,600 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపింది.