బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.అజ్మీర్ దర్గాపై విశ్వసనీయత కోల్పోయేలా రాజా సింగ్ కామెంట్లు చేశారంటూ మహమూద్ అలీ అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఆ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు న్యాయ సలహా తీసుకున్న అనంతరం రాజా సింగ్పై ఐపీసీ సెక్షన్ 295A కింద కేసు నమోదుచేసినట్లు సీఐ ఉమా మహేశ్వర్ చెప్పారు.