ఇంజినీర్లకు సబ్ స్టేషన్ డ్యూటీలు వేయండి! : ఎస్‌‌పీ డీసీఎల్ సీఎండి జితేశ్ పాటిల్

ఇంజినీర్లకు సబ్ స్టేషన్ డ్యూటీలు వేయండి! : ఎస్‌‌పీ డీసీఎల్ సీఎండి జితేశ్ పాటిల్

హైదరాబాద్, వెలుగు: ఆర్టిజన్ల సమ్మె కారణంగా విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సబ్‌‌స్టేషన్ల వద్ద కన్‌‌స్ట్రక్చన్ ఇంజినీర్లు, సబ్​ఇంజినీర్లకు డ్యూటీలు వేయాలని చీఫ్​ఇంజినీర్లను ఎస్‌‌పీడీసీఎల్ సీఎండి జితేశ్ పాటిల్ ఆదేశించారు. ఆర్టిజన్‌‌ల సమ్మెపై శనివారం ఆయన హైదరాబాద్‌‌లోని మింట్​ కాంపౌండ్​ ఆఫీస్​నుంచి అన్ని జిల్లాల చీఫ్ ​ఇంజినీర్లతో టెలీ కాన్ఫరెన్స్​నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టిజన్ల​సమ్మె ప్రభావాన్ని, విద్యుత్​ సరఫరాకు కలిగే ఇబ్బందులను ఫీల్డ్​నుంచి అడిగి తెలుసుకున్నారు. 

నిరంతర విద్యుత్ సరఫరాకు క్షేత్ర స్థాయిలో తీసుకున్న చర్యలను లోకల్​ఆఫీసర్లు సీఎండీకి వివరించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్‌‌ను సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సర్కిల్‌‌లో ఉన్న  ఓఅండ్ఎం స్టాఫ్ , సబ్ ఇంజినీర్లు, ఎమ్‌‌ఆర్‌‌‌‌టీ, డీపీఈ, కన్‌‌స్ట్రక్చన్ ఇంజనీర్లకు షిఫ్ట్ పద్ధతిలో సబ్‌‌స్టేషన్లు వద్ద డ్యూటీలు  వేయాలని ఆదేశించారు. ఫీల్డ్ లెవెల్‌‌లో మొత్తం ఓఅండ్ఎం మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. విద్యుత్ అంతరాయల గురించి ఎప్పటికప్పుడు తనకు  తెలియచేయాలని ఎస్‌‌ఈలను ఆదేశించారు.