జూబ్లీహిల్స్ , వెలుగు: వాషింగ్ మిషన్ పేలిన ఘటనలో ఎల్జీ కంపెనీపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్సార్ నగర్ పరిధి ధరంకరం రోడ్లోని కేకే ఎన్ క్లేవ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 503లో రెండు రోజుల క్రితం ఎల్జీ కంపెనీకి చెందిన వాషింగ్ మెషిన్ పేలిన సంగతి తెలిసిందే. బాల్కనీలో వాసింగ్మెషిన్ రన్నింగ్లో ఉండగానే, భారీ శబ్దంతో బ్లాస్ట్ అయ్యిందని బాధితుడు వి.ఎస్.ఆర్. శాస్త్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎల్జీ కంపెనీపై ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
