వీసీ అయ్యాక నీ కళ్లు నెత్తికెక్కినయి!

వీసీ అయ్యాక నీ కళ్లు నెత్తికెక్కినయి!
  • మహిళా వర్సిటీ వీసీని తిట్టిన కేసులో బీఆర్ఎస్ లీడర్ అరెస్ట్

బషీర్ బాగ్, వెలుగు :  కోఠి మహిళా వర్సిటీ వీసీని తిట్టిన కేసులో గోషామహల్ బీఆర్ఎస్ లీడర్ ​గడ్డం శ్రీనివాస్ యాదవ్ పై సుల్తాన్ బజార్ పీఎస్ లో  కేసు నమోదైంది. సీఐ బాలగంగాధర్ రెడ్డి తెలిపిన ప్రకారం.. ఈనెల 1న మహిళా వర్సిటీ వీసీ విజ్జులత చాంబర్ కు గడ్డం శ్రీనివాస్ వెళ్లి సోషల్ వర్కర్ గా పరిచయం చేసుకుని.. బాలికలకు ఉచిత విద్య, స్కాలర్ షిప్స్​ అందిస్తున్నాని, తనను వర్సిటీ తరఫున సన్మానించాలని కోరారు. దీనికి వర్సిటీ అభివృద్ధికి సహకరించాలని వీసీ సూచించారు. 

దీంతో శ్రీనివాస్ “ నేను గోషామహల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని. నువ్వు ఏమైనా ఐఏఎస్ వా, ఐపీఎస్ వా?..  వీసీ అయ్యాక నీ కళ్లు నెత్తికెక్కినయి’.. అని దురుసుగా ప్రవర్తించడంతో వీసీ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం అతడిని అరెస్ట్ చేసి కోర్టు లో హాజరుపరిచారు.