తెలంగాణ లో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు మూడు రోజులు పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో ఎన్నికలు నిర్వహించేందుకు సీఈసీ దృష్టి పెటింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేసే చర్యలో భాగంగా ఈరోజు ( జూన్22) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తో భేటీ అవుతారు. రేపు, ఎల్లుండి ( జూన్ 23,24) సీఎస్ తో సమీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర స్థాయి అధికారులకు ఈ నెల 5 నుంచి 10 వరకూ ఈసీ మాస్టర్ ట్రైనర్స్కు శిక్షణ ఇచ్చింది. మూడు సంవత్సరాలు ఒకే చోట పనిచేస్తున్న అధికారుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో ఈ బదిలీల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. జులై 31 లోపు ఈ బదిలీల ప్రక్రియ పూర్తి కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.99 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
ALSO READ: వాళ్ల ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయ్ : రేవంత్ రెడ్డి