షాద్ నగర్లో వెటర్నరీ డాక్టర్ హత్యపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సంచలనం సృష్టించిన డాక్టర్ హత్యపై పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు స్పందించారు,
సిగ్గుచేటు..ఇక ముగింపు పలకాలి: వీరాట్ కొహ్లీ
హైదరాబాద్ లో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు. సమాజంలో మనం బాధ్యతగా తీసుకుని ఇలాంటి ఘటనలకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది.
What happened in Hyderabad is absolutely shameful.
It's high time we as a society take charge and put an end to these inhumane tragedies.— Virat Kohli (@imVkohli) November 30, 2019
మాటలు కాదు చేతల్లో చూపించాలి: ప్రియాంక గాంధీ వాద్రా
‘హైదరాబాద్లో వెటర్నరీ డాక్టర్ అలాగే యూపీ సంబల్లోని టీనేజ్ బాలికపై జరిగిన లైంగిక దాడి అతి క్రూరమైనవి. ఈ ఘటనలు నన్నుకలిచివేశాయి. నా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి మాటలు సరిపోవడం లేదు. ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరిగినప్పుడు మాట్లాడటం కంటే మనం చేయాల్సిందే ఎక్కువగా ఉంది‘.
I have been so deeply disturbed by the savage rape and murder of the young veterinarian in Hyderabad and the teenage girl in Sambhal that no words are enough to express my outrage.
As a society, we have to do far more than just speak up when these horrific incidents take place.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 30, 2019
ఇలాంటి ఘటనలకు పుల్ స్టాప్ పెట్టాలి: అక్షయ్ కుమార్
హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ అయినా, తమిళనాడులో లాయర్ అయినా, రాంచీలో గ్యాంగ్ రేప్ అయినా తీరు మారడం లేదు. నిర్భయం చట్టం తెచ్చి 7 సంవత్సరాలు అయినా ఇలాంటి ఘటనలు ఆగడం లేదు కదా. ఇంకా ఎక్కువవుతున్నాయి. ఇలాంటి ఘటనల వల్ల మనం సమాజాన్ని కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఇలాంటి ఘటనలను మనం ఆపాలి.
Whether it is #PriyankaReddy in Hyderabad, #Roja in Tamil Nadu or the law student gangraped in Ranchi,we seem to be losing it as a society. It has been 7 yrs to the gut-wrenching #Nirbhaya case & our moral fabric continues to be in pieces.We need stricter laws.This needs to STOP!
— Akshay Kumar (@akshaykumar) November 29, 2019
ఎంతో కలిచి వేసింది: పరిణితి చొప్రా
‘వెటర్నరీ డాక్టర్ ఘటన నన్ను ఎంతో కలిచి వేసింది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా‘. అని ట్వీట్ చేశారు.