తెలుగు రాష్ట్ర ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుక అందించింది. సికింద్రాబాద్ -విశాఖపట్టణం మధ్య నడిచే ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ ను ఈనెల15వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్,జి.కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈనెల 15న ఉదయం10 గంటలకు తొలి వందే భారత్ రైలు కూత పెట్టనుంది.
షెడ్యూల్ ప్రకారం ఈనెల19వ తేదీన కార్యక్రమం జరగాల్సి ఉన్నప్పటికీ పండగ సమయంలో తెలుగు ప్రజలకు కానుకను ఇచ్చేందుకు నాలుగురోజులు ముందే ఈ రైలు ప్రారంభించనున్నారు. దేశంలోని 8వ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా దాదాపు 8 గంటల్లో విశాఖపట్టణం చేరుకోనుంది.