50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం .. తెలంగాణలో 12

50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం .. తెలంగాణలో 12

దేశంలో కొత్తగా 50 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 5, తెలంగాణకు 12 కొత్త కాలేజీల ఏర్పాటుకు  కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఒక్కో కాలేజీలో 2023,24 విద్యా సంవత్సరం  నుంచి  150 సీట్లతో క్లాసులు ప్రారంభం అవుతాయని  కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

తెలంగాణలో..

తెలంగాణలోని మేడ్చల్‌, వరంగల్‌, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, అసిఫాబాద్‌, నిర్మల్‌, సిరిసిల్ల, వికారాబాద్‌, జనగాం, హైదరాబాద్‌లలో కొత్త కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది. మేడ్చల్‌-మల్కాజిగిరిలో అరుంధతి ట్రస్ట్‌, మేడ్చల్‌లో సీఎంఆర్‌ ట్రస్ట్‌, వరంగల్‌లో కొలంబో ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో వైద్యకళాశాలలు ఏర్పాటు కానున్నాయి. మిగిలిన అన్ని కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది.


ఆంధ్రప్రదేశ్‌లో

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు కానున్నాయి.