రూ. 40లక్షలు పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

రూ. 40లక్షలు పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

బషీర్ బాగ్,వెలుగు : అక్రమంగా డబ్బును తరలిస్తున్న ఇద్దరిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 40 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. మేడ్చల్ జిల్లాకు చెందిన కారుడ్రైవర్ డేవిన్ ముత్యాలు, సంగారెడ్డి జిల్లాకు చెందిన కె. రాజేశ్ లు హఫీజ్ పేట్ కు చెందిన విల్సన్ బాబు వద్ద కొంతకాలంగా పని చేస్తున్నారు. విల్సన్ బాబు ఆదేశాల మేరకు అక్రమంగా డబ్బులను తరలిస్తున్నారు. 

గురువారం అబిడ్స్ పరిధి రామకృష్ణ థియేటర్ పార్కింగ్ ప్లేస్ లో కారు( టీఎస్ 08 హెచ్ వై1919)ను పార్క్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ. 40 లక్షల నగదును తీసుకొని విల్సన్ బాబుకు అందించేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందడంతో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు.