ముందస్తు టిప్ ఆప్షన్ వద్దు..క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశం 

ముందస్తు టిప్ ఆప్షన్ వద్దు..క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశం 

న్యూఢిల్లీ: కారు, ఆటో, బైక్​ బుక్​ కాకముందే డ్రైవర్​కు టిప్ ఇచ్చే​ ఆప్షన్లు  చూపెట్టడం ఆపేయాలని ఉబర్​, ఓలా, ర్యాపిడో వంటి కాబ్ అగ్రిగేటర్లను కేంద్రం ఆదేశించింది.  ఈ పద్ధతి మోసపూరితమని, వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే బుధవారం స్పష్టం చేశారు.  ర్యాపిడో సంస్థ అనైతిక వ్యాపార పద్ధతులకు పాల్పడినందుకు సెంట్రల్ ​కన్జూమర్​ ప్రొటెక్షన్​అథారిటీ రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఉబర్, ఓలా సంస్థల వ్యాపార విధానాలపై కూడా సమగ్ర విచారణ కొనసాగుతోంది. ముందస్తు టిప్​పై జాతీయ వినియోగదారుల హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భారీగా ఫిర్యాదులు అందాయి. దీంతో కేంద్రం ఈ ప్రకటన చేసింది.