బార్డర్ లో భారత్, చైనా దీపావళి సందడి

బార్డర్ లో భారత్, చైనా దీపావళి సందడి

దీపావళి సందర్భంగా బార్డర్ లో భారత ఆర్మీకి చైనా ఆర్మీ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.  ఈస్ట్రన్ లఢక్ లోని సరిహద్దు పోస్టు వద్ద ఇరు దేశాల ఆర్మీ అధికారులు కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు.ఇందులో భాగంగా భారత ప్రజలకు దీపావళీ శుభాకాంక్షలు తెలుపుతూ.. పెద్ద ఎత్తైన బ్యానర్ ను ప్రదర్శించారు చైనా మిలటరీ అధికారులు. ఇరు దేశాల మధ్య మరింత సామరస్య వాతావరణం ఏర్పడాలని పలువురు కోరారు. ఈ విషయంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడులో స్నేహపూర్వకంగా కలిసిన మీటింగ్ ఇరు దేశాలకు కలిసివచ్చిందని రెండు దేశాలు కలిసి మరింత అభివృద్ధి చెందాలని విష్ చేశారు.