మోడీ మళ్లీ రాకుండా చేద్దాం : సోనియాతో చంద్రబాబు భేటీ

మోడీ మళ్లీ రాకుండా చేద్దాం : సోనియాతో చంద్రబాబు భేటీ

ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెండు రోజుల్లో ఆరు పార్టీల అధినేతలతో చర్చలు జరిపిన బాబు….తొలిసారి UPA చైర్ పర్సన్ సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. పార్టీల అధినేతలతో జరిగిన చర్చల వివరాలను సోనియాకు వివరిస్తున్నారు బాబు. మరోవైపు ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.

మరోవైపు నిన్న రాహుల్ తో భేటీ అయిన బాబు… ఇవాళ ఉదయం మరోసారి సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపైనా ఇరువురు చర్చించినట్లు సమాచారం. ఎగ్జిట్  పోల్స్  వచ్చాక ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కూడా రాహుల్ తో జరిగిన సమావేశంలో చర్చించారు. ఫలితాల కంటే ముందే బీజేపీయేతర పార్టీల నేతలంతా సమావేశమైతే బాగుంటుందని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దాదాపు 20 నిమిషాల పాటు రాహుల్ తో సమావేశమైన చంద్రబాబు తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో అరగంటపాటు చర్చించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో తాజా రాజకీయ పరిస్థితులపై మరోసారి చర్చించారు చంద్రబాబు.