ఎల్బీనగర్, వెలుగు: బహుజనులు 75 ఏళ్లుగా బానిసలుగానే బతుకున్నారని రాష్ట్ర బీఎస్పీ సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలు 75 ఏళ్లుగా అణిచితవేత,అవమానాలతో జీవిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పాలక వర్గాలు ధనిక వర్గలకు కొమ్ముకాస్తూ.. పేదలను బాగు విస్మరించి ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. బహుజన రాజ్యం వస్తేనే న్యాయం జరుగుతుందని అన్నారు. రాజ్యాధికారం సాధించుకుంటేనే అంబేడ్కర్ ఆశయాలు నేరవేరినట్లవుతాయని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భూస్వాముల వర్గాలకే కాంట్రాక్టులు వెళ్లాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ దాత అల్వాల్ శేఖర్, బీఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడంగ్పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్, ద్రావిడ బహుజన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జిలకర శ్రీనివాస్, భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులు బైరి నరేష్, బహుజన ధూం ధాం వ్యవస్థాపకులు వాగ్గేయకారుడు మచ్చ దేవేందర్, రాంబాబు, ప్రవీణ్, నవోదయ యూత్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బహుజనులు పాలకులైతేనే పేదల బతుకుల్లో మార్పు
- తెలంగాణం
- May 25, 2022
లేటెస్ట్
- ఒంటెపై వచ్చి.. నామినేషన్ వేసిన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి
- జగన్.. ఇక బ్యాండేజ్ తీసేయ్.. సునీత
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- April 25th World Malaria Day : మాయదారి మహమ్మారి.. మలేరియా
- SRH vs RCB: ఉప్పల్లో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరు
- రామగుండం పోలీస్ కమిషనరేట్ లో.. సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్
- ఫ్రీఫుడ్ వీడియో షేర్ చేశాడని..ఉద్యోగం నుంచి తీసేశారు
- Loksabha Elections: బంపర్ ఆఫర్.. ఓటేస్తే బీరు, దోశ, క్యాబ్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ...
- చికెన్ తింటున్నారా జాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్..ఏవియన్ ఫ్లూ వస్తోంది
- బీజేపీ ఆఖరి అస్త్రం.. రిజర్వేషన్లు రద్దు : సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం