హైదరాబాద్ సిటీ, వెలుగు : తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల్లో ఇండియన్ బ్యాంక్ మెగా రామ్ (రిటైల్, అగ్రికల్చర్ , ఎంఎస్ఎంఈ) క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించి, మొత్తం ₹1,422 కోట్ల విలువైన లోన్లను లబ్ధిదారులకు మంజూరు చేసి, వెంటనే విడుదల చేసింది. తిరుపతిలో జరిగిన డిస్బర్స్మెంట్ ఈవెంట్లో ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణేశ్ కుమార్, జోనల్ మేనేజర్ సెల్వరాజ్ ఎం పాల్గొన్నారు. లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్లను అందజేశారు.
కస్టమర్ సెంట్రిక్ లోన్ పాలసీలను అమలు చేస్తూ.. డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా సులభంగా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని వివిధ జోన్లలో ఈ కార్యక్రమాలు నిర్వహించామని , డీఆర్డీఏ, ఎంఈపీఎంఏ వంటి ప్రభుత్వ సంస్థల అధికారులు పాల్గొని ఆంట్రప్రెన్యూర్లకు, చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయం అందిచామన్నారు.
