హైదరాబాద్ మెట్రో రైళ్ల  వేళల్లో మళ్లీ మార్పులు 

హైదరాబాద్ మెట్రో రైళ్ల  వేళల్లో మళ్లీ మార్పులు 

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగింపుతో హైదరాబాద్‌ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు చేశారు అధికారులు. ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో సర్వీస్‌ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో సర్వీస్‌ బయలుదేరుతుంది. సాయంత్రం 6 గంటలకల్లా మెట్రో రైళ్లు టెర్మినల్ స్టేషన్ కు చేరుకోనున్నాయి.

కరోనా రెండో వేవ్‌  కట్టడి కోసం  రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ.. పలు సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుత లాక్‌డౌన్‌ గడువు నేటివరకు వరకు ఉండగా.. మరో 10 రోజులపాటు పొడిగించింది. సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచింది. ప్రజలు ఇళ్లు, గమ్యస్థానాలకు చేరుకునేందుకు మరో గంటపాటు అదనంగా సమయాన్ని సడలింపునిచ్చింది.