
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు మొదలయ్యాయి. కీలక విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్లి, ఇటీవలే రాష్ట్ర క్యాడర్కు తిరిగొచ్చిన 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి చారు సిన్హాకు సీఐడీ అడిషనల్ డీజీగా పోస్టింగ్ ఇచ్చారు.
1994 బ్యాచ్కి చెందిన మరో సీనియర్ ఐపీఎస్ షీకాగోయల్కు గతంలో ఉన్న కొన్ని పోస్టింగ్స్ తొలగిస్తూ.. టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా, టీజీఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్గా ఫుల్ అడిషనల్ చార్జ్ ఇచ్చారు. అదే విధంగా వెయిటింగ్లో ఉన్న అభిలాష బిస్త్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా నియమితులయ్యారు.