నెంబర్​ ప్లేట్స్​ లేకుండా తిరిగితే కేసులు : డీఎస్పీ రెహమాన్

నెంబర్​ ప్లేట్స్​ లేకుండా తిరిగితే కేసులు : డీఎస్పీ రెహమాన్

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: నెంబర్​ ప్లేట్స్​ లేకుండా తిరిగే వెహికల్స్​పై చీటింగ్​ కేసులు నమోదు చేస్తామని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్​ పేర్కొన్నారు. ఎస్పీ రోహిత్​ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ పరిధిలో శుక్రవారం ట్రాఫిక్​ పోలీసులు స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కొత్తగూడెం త్రీ టౌన్​ పీఎస్​పరిధిలో  నెంబర్​ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న ఇద్దరిపై, వన్​ టౌన్​పరిధిలో ముగ్గురిపై చీటింగ్​ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కొందరు నేరస్తులు నెంబర్​ ప్లేట్స్​ లేని వెహికల్స్​తో  తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. నేరాల నియంత్రణకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్పెషల్​ డ్రైవ్​లో వన్​ టౌన్, త్రీ టౌన్​ సీఐలు కరుణాకర్, శివప్రసాద్, ట్రాఫిక్​ ఎస్ఐలు నరేశ్, మదార్, సిబ్బంది పాల్గొన్నారు.