హెటిరో ల్యాబ్స్ లో చిరుత సంచారం

హెటిరో ల్యాబ్స్ లో చిరుత సంచారం

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత పులి సంచారం కలకలం సృష్టించింది. హెటిరో ల్యాబ్ ఇండస్ట్రీలోకి చిరుత పులి ప్రవేశించింది. దీంతో కార్మికులు భయాందోళనలతో పరుగులు తీశారు.

పరిశ్రమలోని ఓ బ్లాక్ లో చిరుత పులి ఉన్నట్లు కార్మికులు చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే చిరుత ఇండస్ట్రీలోని హెచ్ బ్లాక్ లో పైన నక్కినట్లు సీసీ కెమెరాను బట్టి తెలుస్తోంది. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు హైదరాబాద్ నుంచి రెస్క్యూ టీంను రప్పించారు. రెస్క్యూ టీం వచ్చాక శబ్దాలు చేసి చిరుతను కిందకు దింపే ప్రయత్నం చేశారు.