ఉద్యోగులకు బంపర్ ఆఫర్..100 మందికి కార్లు గిఫ్ట్

ఉద్యోగులకు బంపర్ ఆఫర్..100 మందికి కార్లు గిఫ్ట్

 కొన్ని కంపెనీలు ఉద్యోగుల శ్రమకు తగ్గ గుర్తింపునిస్తాయి. లాభాలు వస్తే.. ఉద్యోగులకు బోనస్ లు, లేదంటే.. స్వీట్ బాక్స్ లు, ప్రత్యేక ఆఫర్లు ఇస్తాయి.లేటెస్ట్ గా చెన్నైలోని ఓ సంస్థ ఏకంగా కార్లనే గిఫ్ట్ గా ఇచ్చి ఉద్యోగులను ఖుషీ చేసింది.  చెన్నైలోని ఐడియాస్ 2ఐటీ అనే ఐటీ సంస్థ తమ సిబ్బందికి కార్లను గిఫ్ట్ గా ఇచ్చింది. సంస్థ అభివృద్ధిలో భాగస్వాములైన  100 మంది ఉద్యోగులకు 100 కార్లను బహుమతిగా ఇచ్చింది. ఆ  సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ మురళీ వివేకానందన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాయత్రి వివేకానందన్ సోమవారం మారుతీ సుజుకి కార్లను ఉద్యోగులకు అందించారు.

 

10 సంవత్సరాలకు పైగా తమ సంస్థలో భాగమైన 100 మంది ఉద్యోగులకు  100 కార్లను బహుమతిగా ఇస్తున్నామన్నారు ఐడియాస్2ఐటి మార్కెటింగ్ హరి హెడ్ సుబ్రమణియన్. తమ సంస్థలో ఇపుడు 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. తాము పొందిన లాభాలను ఉద్యోగులకు తిరిగి ఇవ్వాలనేది తమ కోరిక అన్నారు. 

సంస్థ నుండి బహుమతులు తీసుకోవడం తమకు ఎప్పడు గొప్ప విషయమన్నారు ఉద్యోగులు. గోల్డ్ కాయిన్స్, ఐఫోన్‌లు వంటి గిఫ్ట్ లతో  కంపెనీ   తన ఆనందాన్ని ఉద్యోగులతో  పంచుకుంటుందని..ఈ సారి కారును  గిఫ్ట్ గా ఇవ్వడం తమకు ఆనందంగా ఉందన్నారు.