- ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్
- సందడి చేసిన సినీనటి కృతిశెట్టి..
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సిటీలోని కోర్టు రోడ్డులో సోమవారం అట్టహాసంగా చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభమైంది. సినీనటి కృతిశెట్టి, బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ షాపింగ్ మాల్ను ప్రారంభించారు. ఇది చెన్నయ్ షాపింగ్ మాల్కు 18 వ షోరూం. మాల్ మొదటి అంతస్తును మంత్రి గంగుల కమలాకర్, రెండో అంతస్తు ఆభరణాల విభాగాన్ని సినీనటి కృతిశెట్టి ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు.
ప్రారంభ వేడుకలో భాగంగా అభిమానులతో మాల్ కిక్కిరిసి పోయింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్ సరిళ్ల ప్రసాద్, నిర్వాహకులు మర్రి జనార్ధన్ రెడ్డి, మర్రి వెంకట్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డిలు పాల్గొన్నారు. పట్టు, ఫ్యాన్సీ శారీస్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, జ్యూయెలరీతో పాటు పలు విభాగాలు అందుబాటులోకి వచ్చాయి.