కరోనా హాట్‌స్పాట్‌ తమిళనాడు కోయంబేడు మార్కెట్

కరోనా హాట్‌స్పాట్‌ తమిళనాడు కోయంబేడు మార్కెట్

527 కేసుల్నీ ఒక్క చోట నుంచే ​
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని అతి పెద్ద విజిటబుల్​మార్కెట్​వైరస్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 527 కేసులు నమోదుకాగా, ఒకరు చనిపోయారు. సోమవారం నమోదైన కేసులన్నీ కోయంబేడు మార్కెట్‌కు సంబంధించినవేనని సర్కార్​ వెల్లడించింది. మార్కెట్‌కు సంబంధం ఉన్న వారి నుంచి 100కు పైగా శాంపిల్స్ కలెక్ట్​చేసినట్లు కుడ్డలూర్‌‌లో ఉన్న అధికారులు చెప్పారు.