కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మొద్దు : కాలె యాదయ్య

కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మొద్దు : కాలె యాదయ్య

చేవెళ్ల, వెలుగు: కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మొద్దని చేవెళ్ల సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య ఓటర్లకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చేవెళ్లలోని షాబాద్ మండలం, అంతారం, కేసారం, కక్కులూరు, సర్దార్ నగర్, కురువగూడ, బొడం పహాడ్, మనమర్రి, అప్పరెడ్డి గూడ ప్రాంతాల్లో ఆయన ప్రజా ఆశీర్వద యాత్ర చేపట్టారు. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో కాలె యాదయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలు కేసీఆర్​కు రెండుసార్లు అండగా నిలిచారన్నారు. మరోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని యాదయ్య తెలిపారు. కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పాకులాడటమే తప్ప ప్రజా క్షేమాన్ని పట్టించుకోరని ఆయన విమర్శించారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట షాబాద్ ఎంపీపీ అవినాశ్ రెడ్డి ఉన్నారు.