సంగాయిపల్లి తండాలో నీళ్లు అనుకొని టర్పెంట్ ఆయిల్ తాగిన చిన్నారి

సంగాయిపల్లి తండాలో నీళ్లు అనుకొని టర్పెంట్ ఆయిల్ తాగిన చిన్నారి
  • అంగన్​వాడీ సిబ్బంది నిర్లక్ష్యం

గండీడ్, వెలుగు: నీళ్లు అనుకొని పొరపాటున ఓ చిన్నారి టర్పెంట్​ ఆయిల్​ తాగింది. మహబూబ్​నగర్​ జిల్లా మహమ్మదాబాద్ మండలంలోని సంగాయిపల్లి తండాలో ఈ ఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. తండాలోని‌ ప్రాథమిక పాఠశాలలో  ఓ గదిలో అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇటీవల స్కూళ్లు రీ ఓపెన్​ కావడంతో రంగులు వేశారు. రంగులో కలపడానికి తీసుకొచ్చిన టర్పెంట్​ ఆయిల్ కొంత మిగలగా అక్కడే వదిలేశారు.

శుక్రవారం అంగన్​వాడీలో చదువుకుంటున్న మూడేళ్ల పాప నీళ్లు అనుకుని టర్పెంట్​ ఆయిల్​ను నోట్లో పోసుకుంది. ఇంటికి వెళ్లాక నీరసంగా ఉండడంతో తల్లిదండ్రులు సాయంత్రం మహమ్మదాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించి ఇంటికి తీసుకెళ్లారు. రాత్రివేళ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. బాలిక పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది.