
గద్వాల, వెలుగు: ఎవరెస్ట్ శిఖరాన్ని గట్టు మండలం చిన్నోనిపల్లి విలేజ్ కి చెందిన హైమావతి అధిరోహించారు. తూప్రాన్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల నుంచి 20 మంది సభ్యులు ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లారు. ఆ గురుకులంలో గట్టు మండలం చిన్నోలిపల్లి గ్రామానికి చెందిన హైమావతి ఎనిమిదో తరగతి చదువుతోంది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, మరో రెండు రోజుల్లో తిరిగి వస్తున్నట్లు ఆమె తండ్రి కురువ గోవిందు తెలిపారు.
మారుమూల గ్రామానికి చెందిన హైమావతి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గ్రామానికి గుర్తింపు తెచ్చిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.