జీహెచ్ఎంసీలో ఓటేసిన ప్రముఖులు

జీహెచ్ఎంసీలో ఓటేసిన ప్రముఖులు

జీహెచ్ఎంసీలో పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖులంతా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఫిలీంనగర్ క్లబ్ లో మెగస్టార్ చిరుదంపతులు,శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ  ఓటు వేశారు. నాంపల్లిలో సైబరాబాద్ సీపీ సజ్జనార్,  కుందన్ బాగ్ చిన్మయి స్కూల్ లో రాచకొండ సీపీ మహేశ్ భగవత్, అంబర్ పేట ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మంత్రి కేటీఆర్ బంజరాహిల్స్ లోని నందినగర్ లో పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. ఓల్డ్ సిటీ శాస్త్రీపురంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓటు వేశారు. చిక్కడపల్లిలో బీజేవైఎం ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్  క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు.  గ్రేటర్​లో 74 లక్షల 67 వేల 256 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 9,101 పోలింగ్‌ సెంటర్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్​ ఏర్పాటు చేసింది. పోలింగ్‌ సెంటర్లకు అన్ని దిక్కులా 100 మీటర్ల మేరకు 144 సెక్షన్​ అమలులో ఉంటుంది. గ్రేటర్​లో 74 లక్షల 67 వేల 256 మంది ఓటర్లు ఉన్నారు. కరోనా పేషెంట్లకు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఓటేసేందుకు అనుమతి ఉంటుం ది. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది.