
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో కలిసి లండన్కు వెళ్లారు. తన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి సరదాగా లండన్లో విహరిస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన Xలో పంచుకున్నారు.
"రేపు పారిస్కు వెళ్లే మార్గంలో లండన్లోని హైడ్ పార్క్లో కుటుంబం మరియు గ్రాండ్ లిటిల్ వన్ క్లిన్ కారాతో ప్రశాంతమైన క్షణాన్ని ఆస్వాదిస్తూ!" బ్యూటిఫుల్ మెమోరీని షేర్ చేశారు. అయితే ఈ స్పెషల్ ట్రిప్ పారిస్ బెకాన్స్లో జరిగే ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో చిరు ఫ్యామిలీ పాల్గొనబోతున్నారు. ఈనెల జూలై 26 నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి.
అలా తాజాగా లండన్లోని హైడ్ పార్క్లో చిరంజీవి ఫ్యామిలీ కలిసి దిగిన ఫొటో ఇప్పుడుసోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో మెగా క్వీన్ క్లింకారా కొణిదెల ఫేస్ కొంచెం మాత్రమే కనిపించింది. దీంతో ఇప్పుడు కూడా క్లింకారా ఫేస్ ని పూర్తిగా చూపించకపోవడంతో మెగా ఫ్యాన్స్ జస్ట్ మిస్ అయ్యాం భయ్యా..అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం చిరు ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. మరోవైపు అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీలో చెర్రీ పార్ట్ షూటింగ్ ఇటీవల పూర్తైంది.
Relishing a serene moment with family and the grand little one Klin Kaara at Hyde Park London, en route our journey to Paris tomorrow!
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 24, 2024
Summer Olympics 24 Inaugural Event Beckons :) pic.twitter.com/bFa31zBh3a