
రక్తదానం ఎంతో గొప్పదని నమ్మిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొన్నేళ్ల క్రితమే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పేరుతో ఓ సంస్ధను మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతీ ఏటా తాను రక్తదానం చేస్తూ అభిమానులను, యువతను కూడా ఆ దిశగా నడిపిస్తున్నారు చిరు. నేడు (మంగళవారం ) ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా చిరు ఓ అ సందేశాన్ని ఇస్తూ ట్వీట్ చేశారు. రక్తదానం అనేది ఇతరుల ప్రాణాలను రక్షించడంలో సులువైన మార్గమని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలో మనం నిలిచామని..అత్యధిక రక్తదాతలున్న దేశాలలో ఒకటిగా ఉండాలనే లక్ష్యంతో ఉందామని పిలుపునిచ్చారు. రక్త దానం చేయండి ప్రాణాలను నిలబెట్టండి అంటూ ఆయన తన ట్వీట్కు ఓ హ్యాష్ ట్యాగ్ను కూడా జత చేశారు. ఈక్రమంలో పలు సమయాల్లో తాను రక్త దానం చేసిన ఫొటోలను చిరు షేర్ చేశారు.
Blood donation is the simplest way of helping save other’s lives. We are the 2nd most populated country in the world.This #WorldBloodDonorsDay let’s also aim to be among the countries with Highest No of Blood Donors! #DonateBloodSaveLives pic.twitter.com/56lZiG6Vrk
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2022