
నటుడు అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన సదన్ హీరోగా, సాయికుమార్ కీలకపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో పారమళ్ల లింగయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్. ఫీల్గుడ్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి ‘చూడకయ్యో.. నెమలికళ్ళ’ అనే పాటను లిరిసిస్ట్ చంద్రబోస్ రిలీజ్ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఈ పాటలో మంచి సాహిత్యం, సంగీతం ఉంది. మార్కండేయ ఆకట్టుకునే స్వరకల్పన చేశాడు. అందరికి చేరువయ్యే తేలికైన మాటలతో.. వినగానే రసానుభూతి కలిగించేలా మంచి సాహిత్యం అందించారు.
Also Read :- ఈ మత్తు దసరా వరకు
మార్కండేయ రాసిన ఈ పాటకు గాయనీ సునీత, సాయిచరణ్ తమ గాత్రంతో పాటకు జీవం పోశారు.ఈ చిత్రాన్ని పీఎల్వి క్రియేషన్స్ పతాకంపై పారమళ్ల లింగయ్య తెరకెక్కిస్తున్నారు. పాటలతో పాటు సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.