
హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగిన కల్తీ కల్లు వ్యవహారంలో బాధ్యులపై ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంది. బాలానగర్ ఎక్సైజ్ ఎస్ హెచ్ఓ వేణు కుమార్ ను సస్పెండ్ చేసింది. డీటీఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్ మాధవయ్య, ఈఎస్ ఫయాజ్, ఏఈఎస్ జీవన్ కిరణ్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
కల్తీ కల్లు ఘటనపై ఐదు టీంలో ఎంక్వైరీ చేయించిన ఎక్సైజ్ శాఖ ఇప్పటికే హైదర్నగర్, హెచ్ఎంటీ హిల్స్, షంషీగూడ, సర్దార్ పటేల్ నగర్ కల్లు దుకాణాల లైసెన్సులు రద్దు చేసింది . నలుగురు వ్యాపారులు రవితేజ గౌడ్ (29), కోన సాయి తేజ గౌడ్ (31), చెట్టు కింది నాగేష్ గౌడ్ (51), బట్టి శ్రీనివాస్ గౌడ్ (39)లను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కల్తీ కల్లు తాగి 8 మృతి చెందగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే.
►ALSO READ | ఐటీ నోటీసులిచ్చిన మరుసటి రోజే..మంత్రి ఇంట్లో నోట్ల కట్టల బ్యాగ్.. వీడియో వైరల్