నకిలి పాస్ పోర్టు కేసులో లుకౌట్ జారీ చేసిన సీఐడీ..

నకిలి పాస్ పోర్టు కేసులో లుకౌట్ జారీ చేసిన సీఐడీ..

నకిలి పాస్ పోర్టు  కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. పాస్ పోర్టు కేసులో సీఐడీ అధికారులు లుకౌట్ జారీ చేశారు. ఫేక్ పాస్ పోర్టులతో 30 మంది దేశం విడిచి వెళ్ళినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. ఆ 30 మంది వివరాలను తెలంగాణ సీఐడీ విదేశాంగ శాఖకు పంపింది. 30 మందిని వెనక్కి రప్పించి విచారించాలని భావిస్తుంది. ఈ 30 మంది పాస్ పోర్టులు రద్దు చేయాలని రీజినల్ పాస్ పోర్టు ఆఫీస్ కు సిఐడి లేఖ రాసింది. 

ఆ 30 మంది వివరాలను వారు వెళ్లిన దేశాలకు సీఐడీ పంపనుంది. ఆయా దేశాల నుండి వారే బలవంతంగా వెనక్కి పంపే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటి వరకు ఫేక్ పత్రాలతో 92 మంది పాస్ పోర్టులు పొందినట్టు అధికారులు గుర్తించారు. ఫేక్ పాస్ పోర్టుల్లో ఎక్కువగా జగిత్యాలతో పాటు ఫలక్ నుమా చిరునామాలతో పొందినట్లు గుర్తించారు. పాస్ పోర్టు కుంభకోణంలో ఏజెంట్లు, సిబ్బంది, కానిస్టేబుల్స్ ను అరెస్టు అధికారులు అరెస్టు చేశారు.