
గద్వాల, వెలుగు: గద్వాలలోని మండల లెవెల్ స్టాక్ పాయింట్ (ఎంఎల్ఎస్ స్టేజ్ -2) గోదాముల్లో సివిల్ సప్లై ఆఫీసర్లు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రికార్డుల్లో ఉన్న లెక్కలకు, నిల్వ ఉన్న స్టాక్కు భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు. గతంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో తనిఖీలు నిర్వహించినట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు. 2023 సంవత్సరానికి సంబంధించిన 1,700 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో సివిల్ సప్లై విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశం, సీఐ పండరి, ఎస్సైలు వెంకటేశ్వర్లు, సాంబశివరావు పాల్గొన్నారు.