
ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సంస్థలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను కూడా వెంటనే పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రగతి భవన్ లో ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చారు కేసీఆర్. కార్మికులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత ఉంటుందని, కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రకటించారు. ప్రతీ డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా ఉండే ఓ సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.